Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్యాంపస్ డ్రైవ్ లో ప్రతిభ చాటిన ఈ ఈ ఈ విభాగం విద్యార్థులు

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ:జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల (అనంతపురం) ఈ ఈ ఈ విభాగంలో మంగళవారం మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నియామకాల్లో ఆన్లైన్ పరీక్షలు 109 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలను నిర్వహించిన అనంతరం నియామక పత్రాలను అందజేయడం జరుగుతుందని కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి డాక్టర్జె. శ్రీనివాసులు తెలిపారు.పరీక్ష కేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. సుజాత , యూనివర్సిటీ ప్రాంగణ నియామకాల అధికారి ఆచార్య వి. సుమలత పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 02.. విద్యార్థులకు పలు సూచనలను అందిస్తున్న డైరెక్టర్ ఆచార్య సుమలత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img