Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్రీడారంగంలో ప్రతిభ చాటిన యశోద పాఠశాల ఆణిముత్యం

విశాలాంధ్ర ^ధర్మవరం : ఇటీవల ఆర్ డి టి స్టేడియంలో జరిగిన ఎస్ జి ఎఫ్ ఫుట్బాల్ ఎంపికలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచి, అండర్ 14 విభాగంలో పాల్గొని రాష్ట్రస్థాయికి యశోద పాఠశాల విద్యార్థి సి.వరుణ్ తేజ్ 9వ తరగతి విద్యార్థి ఎంపిక కావడం జరిగిందని డైరెక్టర్ పృథ్వీరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యశోద పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు కూడా అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, పలు క్రీడా రంగాలలో మా విద్యార్థులు ప్రతిభ కనపరచడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం డైరెక్టర్ ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామ్, అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, అభినందించి, హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img