Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్రీడారంగంలో ప్రభంజనం సృష్టించిన యశోద పాఠశాల విద్యార్థినిలు

విశాలాంధ్ర-ధర్మవరం : విజయ వాడలో ఈనెల నాలుగవ తేదీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జాతీయస్థాయి త్రోబాల్ సెలక్షన్లో యశోద పాఠశాల విద్యార్థినీలు ప్రభంజనం సృష్టించారని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం వారు మాట్లాడుతూ త్రో బాల్ సీనియర్ విభాగంలో పి.పోషిత- తొమ్మిదవ తరగతి, జూనియర్ విభాగంలో హేమశ్రీ-8వ తరగతి, ప్రజ్ఞ- ఎనిమిదవ తరగతి, దాత్రి-ఏడవ తరగతి విభాగం లలో ప్రతిభ ఘనపరిచి, ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన వారందరూ ఈనెల 18 నుండి 19వ తేదీ వరకు కేరళలో జరిగే త్రో బాల్ గేమ్స్ లో పాల్గొంటారని వారు తెలిపారు. అనంతరం డైరెక్టర్, ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు- అశోక్, చరిష్మా, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img