విశాలాంధ్ర ^ధర్మవరం: పట్టణంలోని ఆత్మీయ ట్రస్ట్ కార్యాలయంలో సోమవారము నాడు ఇటీవల భర్తను కోల్పోయిన సిఆర్పి గాయత్రీ కి ట్రస్ట్ చైర్మన్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయచంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ సూర్య ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా పదివేల రూపాయల చెక్కును ఆర్థిక సహాయముగా వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న సీఆర్పీలు, ఉపాధ్యాయులు తమ వంతు సహాయంగా వారికి అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ఆంజనేయులు, సి ఆర్ పి. ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు.