Friday, April 19, 2024
Friday, April 19, 2024

గర్భసంచి వ్యాధిగ్రస్తురాలకి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని కృష్ణాపురం జీరో రోడ్డులో నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన గర్భసంచి వ్యాధితో, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ శంషాద్ కు శనివారము ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. సహాయం అందు కున్న ఆమె మాట్లాడుతూ తన భర్త తోపుడు బండి వ్యాపారం చేస్తూ చాలీచాలని ఆదాయముతో ముగ్గురు కూతుర్లతో బతుకు బండి నెట్టుకు వస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో తనకు గర్భసంచి వ్యాధి రావడంతో తాను జీవించడానికే ఆదాయం చాలాక ఇబ్బందులు పడుతూ ఉన్నాను. అలాంటి సమయంలో ఆరోగ్యం బాగాలేక చికిత్స చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండగా తమ కాలనీలో ఉన్న ఒక వ్యక్తి ఫయాజ్ భాషా వద్దకు పీల్చుకొని రావడంతో తన పరిస్థితిని విన్న ఫయాజ్ భాష తనకు ఆర్థిక సాయం అందజేశారు. ఫయాజ్ భాష నాలాంటి ఎంతోమంది పేదలకు సహాయం చేస్తూ పేదల ఇంట్లో దేవుడయ్యారని తెలిపారు . వక్ బోర్డ్ అధ్యక్షుడు షాషావలి ఉపాధ్యక్షుడు వై. మహబూబ్ బాషా వైసిపి నాయకులు చవ్వ రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి కొడవండ్లపల్లి వలి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img