Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గర్భిణీలకు అన్నదాన కార్యక్రమం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలు వివిధ గ్రామాల నుండి వైద్య పరీక్షల కొరకు వచ్చు వారికి, వారి సహాయకులకు, మరియు ఆరోగ్య కార్యకర్తలకు, ఇతర అనారోగ్యంతో వచ్చిన వారికి, వైద్య పరీక్షల అనంతరం ఆకలి దప్పికలతో వారి గ్రామాలకు తిరిగి వెళ్లరాదని నారాయణ సేవలో భాగంగా 100 మందికి, మంచి రుచికరమైన పౌష్టికాహారమైన భోజనము మరియు వాటర్ ప్యాకెట్లు అందజేశారు ఈ నారాయణ సేవా అన్నదాన . కార్యక్రమానికి వరలక్ష్మి మరియు ఈశ్వర్ ఉపాధ్యాయులు వారి కుమారుడు జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించారని సత్యసాయి తాలూకా సేవా సమితి అధ్యక్షులు శంకర్, తెలిపారు ఈ కార్యక్రమంలో అభిజ్ఞన్ ,తోపాటుగా సత్యసాయి సేవ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img