Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గర్భిణులు, కిశోర్‌ బాలికలు పౌస్టికాహారం తీసుకోవాలి

విశాలాంధ్ర-రాప్తాడు : గర్భిణులు, కిశోర్‌ బాలికలు ప్రతిరోజూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని ఎంపీడీఓ సాల్మన్‌ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని గర్భిణుల ఇళ్ల వద్దకు డాక్టర్‌ శ్రావణితో కలిసి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రక్తహీనత నివారణ కోసం ఆహారపు అలవాట్లును మార్చుకోవాలన్నారు. గర్భవతులు ప్రతినెలా ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ అరుణ, ఏఎన్‌ఎం లీలావతి ఆశా కార్యకర్త గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img