మేడాపురం వెంకటేష్
విశాలాంధ్ర`ధర్మవరం : ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి నిమిత్తం ధర్మవరమునకు వచ్చి, గుండెపోటుతో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లా సుగాలియా గ్రామానికి చెందిన కాయ్ బాయ్ అనే మహిళ (52), భర్త పప్పా తోపాటు ఇద్దరు బిడ్డలతో నెల కిందట ధర్మవరం లోని ఎర్రగుంట క్రాస్ వద్ద కమ్మరి పని నిమిత్తం వచ్చారు. అంతలో బుధవారం రాత్రి కాయ్ బాయ్కు గుండెపోటు రావడంతో మృతి చెందింది. మృతదేహంతో వారి బంధువులు రోదిస్తున్న ఘటన సమాచారాన్ని 25 వ వార్డు కౌన్సిలర్, సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు మేడాపురం వెంకటేష్ తెలిపారు. తదుపరి మేడాపురం వెంకటేష్ అక్కడకు చేరుకొని, తన వంతుగా పదివేల రూపాయల నగదును ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం మృతి చెందిన కుటుంబ సభ్యులు మేడాపురం వెంకటేసుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వచ్చు ఆర్థిక సహాయం గూర్చి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, నాగేంద్ర, శేఖర్, ఈశ్వరయ్య, నారాయణరెడ్డి, మల్లికార్జున రెడ్డి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సిపి నాయకులు 50వేల రూపాయలు వితరణ : పట్టణంలోని వైఎస్ఆర్సిపి నాయకులు నేలకోట ఓబిరెడ్డి రాఘవరెడ్డి మేడాపురం సూరీలు కూడా సమాచారాన్ని కనుగొని, తమ వంతుగా వారు 50 వేల రూపాయల నగదును మృతి చెందిన కుటుంబ సభ్యులకు అందజేశారు. మధ్యప్రదేశ్ కు మృతదేహాన్ని తీసుకొని వెళ్లడానికి ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని మానవతా దృక్పథంతో తాము ఈ సహాయం చేయడం జరిగిందని వైయస్సార్సీపీ నాయకులు తెలిపారు. తదుపరి స్థానిక పట్టణ ప్రజలు కూడా తమ వంతుగా సహాయాన్ని అందించి వారిని మధ్యప్రదేశ్ కు ఓ వాహనం ద్వారా పంపించడం జరిగింది.