విశాలాంధ్ర`అనంతపురం : శెట్టూరు మండల కేంద్రంలోని బుధవారం గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ స్థాపన కోసం కృషి చేసిన ఉద్యమ నాయకులు వెంకటరమణ, ఎస్సార్ రంగనాథన్, గడిచర్ల సర్వోత్తరావ్, పాతూరి నాగభూషణం, చిత్రపటం పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు వారిని స్మరించుకుంటూ గ్రంథాల కోసం వాళ్ళు చేసిన త్యాగాలు కృషిని గురించి గ్రామ ప్రజలకు పెద్దలకు క్షుణ్ణంగా వివరించారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులకు అనేకమైన పోటీ పరీక్షలు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో గ్రంథాలయాదికారి రజిని,గోపి, గ్రామ పెద్దలు రంగనాథ శర్మ, లింగమయ్య, నూరుల్లా, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.