విశాలాంధ్ర-తాడిపత్రి: అనంతపూరం జిల్లాలో తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శాఖా గ్రంథాలయములో శనివారం గ్రంథాలయాధికారి బి రవి కుమార్ నాయుడు ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రికలను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎల్ఎం ఉమా మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రంథాలయాలు సమాజ అభివృద్ధిలో అంతర్భాగమని..అన్ని తరగతుల వాళ్లు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈనెల 14న గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభమై 20వ తేదీ ముగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారులు రవికుమార్ నాయుడు, వి. వీర నారాయణ రెడ్డి, యస్ జయరాములు గ్రామీణ గ్రంథాలయాధికారి దేవదాసు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.