Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

గ్రోమోర్‌ సేవలను సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర ` బ్రహ్మసముద్రం : రైతులు గ్రోమోర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మన గ్రోమోర్‌ ఉపాధ్యక్షులు అరుణ్‌ లెస్లీ జార్జ్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం లో మన గ్రోమోర్‌ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అరుణ్‌ లేస్లీ జార్జ్‌ హాజరై వారు మాట్లాడుతూ పంటలు శాస్త్రీయ సలహా ప్రాముఖ్యతను రైతులకు క్షుణ్ణంగా వివరించి శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగిస్తే లాభదాయకంగా ఉంటుందని మన గ్రోమోర్‌ ఆధ్వర్యంలో రైతుల దగ్గరికి సిబ్బందిని వ్యవసాయ తోటల్లోకి పంపిస్తున్నామని వారి సలహాలు సూచనలు రైతులు తీసుకొని సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రోమోర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ చక్రధర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చినరాయుడు గ్రోమోర్‌ జోనల్‌ మేనేజర్‌ రఘువీరారెడ్డి స్థానిక గ్రోమోర్‌ మేనేజర్‌ రాజేష్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img