Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా జరిగిన రథోత్సవం

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం ఉదయము విశ్వకేశన ఆరాధన, యాగశాల ప్రవేశము, ద్వారా తోరణా, ధ్వజ కుంభ పూజ, అర్చకులు సుదర్శనాచార్యులు, సునీల్‌ కుమార్‌ తో పాటు తిరుమల తిరుపతి పురోహితులు ప్రశాంతు, భార్గవ, మహేష్‌ లు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ప్రత్యేక పూజలు చేసి, ఉదయం గజ వాహనము, సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థాన స్వాములచే నిర్వహించారు. తదుపరి హనుమంత వాహనముతో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలుకు వాహన ఉభయ దాతలుగా గాజుల విజయలక్ష్మి, గాజుల నాగేంద్ర, సి కే. రత్న, సి కె. గోవిందు- మంజునాథ మహేశ్వరి సిల్క్స్‌ వారి సహకారముతో నిర్వహిస్తున్నందుకు కమిటీ ప్రతినిధులు మేటికలకుల్లాయప్ప, దత్త శివ, బేళ్లే నాగప్ప, సాగా సురేష్‌, శంకర సంజీవులు, రంగా శీన, గుద్దిటి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ డి హెచ్‌ ఎస్‌.. వాలంటీర్లు, మహిళా మండలి వారు భక్తాదులకు, సహాయకులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ట్రస్ట్‌ సిబ్బంది, అభివృద్ధి కమిటీ, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img