Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా జరిగిన శ్రీ గోదా రంగనాథ తిరు కళ్యాణ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ఆర్యవైశ్య కొత్త సత్రంలో గురువారం శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథ తీరు కల్యాణ వేడుకలు అత్యంత వైభవంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. అర్చకులు శ్రీనాథ్ శర్మ, పవన్ కుమార్ శర్మలు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ వేడుకలు శ్రీరామ భజన మందిరం కమిటీ దేవతా కృష్ణమూర్తి, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, సంజీవ రాయుడు, జయంతి ప్రసాదుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. అర్చకులు మూల విరాట్ విగ్రహాలకు గంగా పూజ, నిరాటోత్సవం, కన్యాదానం, మాంగల్య పూజ ,మాంగల్య ధారణ లాంటి వేదమంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవమునకు విచ్చేసిన భక్తులకు భోజన సదుపాయం కూడా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, తదుపరి భక్తుల సహకారం, శాశ్వత ఉభయదాతల తో ఈ కళ్యాణోత్సవం నిర్వహించుట జరిగిందన్నారు. అనంతరం సాయంత్రం సంతాన వేణుగోపాల పూజతో కార్యక్రమాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో జయంతి ప్రసాద్, శ్రీ గోదా మహిళా మండలి గీత, శశికళ, కళావతి, స్వాతి, జ్యోతి, అనిత, ప్రతిభ, మాధవి, ప్రశాంతి లతోపాటు అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్న రు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img