Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణ, కుంబాభిషేక మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ లో గల శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కుంబాభిషేకం వేడుకలు, అత్యంత వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ రోజు మంగళవారం మండల ఆరాధన అగ్ని ప్రార్థన పూర్వక మాస్కాండ , సహిత మహా ప్రాయశ్చిత్త హోమాలు, అభిషేకాలు అర్చకులు ఆలూరు నరసింహ శాస్త్రి, ప్రసాద్ శర్మ ,మునిపల్లి భరత సింహ శర్మ ల మధ్య వేద మంత్రాలు,మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. అనంతరం ఈనెల 30వ తేదీ సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజున ఆలయ కమిటీ వారు ఇత్తడితో తయారుచేసిన 60 కేజీల బరువు గల (విలువ దాదాపు ఒక లక్ష 50 వేల రూపాయలు)గుడి కలశమును కూడా ప్రతిష్టించనున్నట్లు వారు తెలిపారు. ఆలయం వెలుపల, బయట వివిధ పూలమాలలతో, విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img