Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జాతీయ మానవ హక్కుల దినోత్సవం

విశాలాంధ్ర.. బొమ్మనహల్ : మండల కేంద్రమైన బొమ్మనహాళ్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కస్తూరిబా బాలికల పాఠశాల లో శనివారం జాతీయ మానవ హక్కుల దినోత్సవం ను మానవ హక్కుల పరిరక్షణ సమితి బొమ్మనహల్ మండల అధ్యక్షులు హరే సముద్రం రాముడు ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించు కోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు మానవ హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నాయని, రాజ్యాంగంలోని పౌరులకు కల్పించిన హక్కులను అవగాహన చేసుకుని, వృద్ధి చెందాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, కార్మికులు, వెనుకబడిన వర్గాలతో పాటు ఇతర వర్గాలు తమ హక్కుల ఉల్లంఘనను గుర్తించి, హక్కులను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల విద్యార్థులు జాగ్రత్త వహించి, తమ హక్కులను కాపాడుతూ, తోటి వారి హక్కులకు భంగం కలిగించకుండా, మంచి పౌరులుగా ఎదగాలని తెలిపారు అనంతరం కళాశాల ఆవరణంలో చెట్లు నాటారు 260 మంది విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ మహాలక్ష్మి మానవ హక్కుల పరిరక్షణ సమితి కనేకల్ అధ్యక్షులు వెంకటేశులు ఉపాధ్యక్షులు నిమ్మకల్ శంకర్ సెక్రెటరీ స్వామి హేమంతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img