Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

విశాలాంధ్ర-పెనుకొండ : మండల పరిధిలోని మావటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయులు నాగార్జునుడు గారి అధ్యక్షతన ఁజాతీయ సైన్స్ దినోత్సవఁ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి విద్యార్థులను ఉద్దేశించి సైన్స్ యొక్క విశేషాలను తెలియజేశారు అనంతరశీ విద్యార్థులు తమలోని సృజనాత్మకత, నైపుణ్యం వెల్లడయ్యేలా ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థుల ఆవిష్కరణలు చూడడానికి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, గ్రామస్థులు రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ముబీన్ తాజ్ ,ప్రభాకర్ , లక్ష్మీకాంతమ్మ, ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img