Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

విశాలాంధ్ర-రాప్తాడు : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాప్తాడు పంచాయతీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ కార్యదర్శి ఈశ్వరయ్య, సర్పంచ్‌ సాకే తిరుపాలు మాట్లాడుతూ, అనేక సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, మతాల కలయిక అయిన భారత దేశానికి రాజ్యాంగం రూపొందించడం ఒక సవాలు వంటిదన్నారు. అంబేద్కర్‌ దాన్ని స్వీకరించి మహోన్నతునిగా నిలిచారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img