Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఘనంగా మౌలానా అబ్దుల్‌ కలాం జయంతి

విశాలాంధ్ర-తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పాత ఈద్గా కూడలిలో ఉన్న మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ విగ్రహం వద్ద శుక్రవారం ముస్లిం మైనార్టీ, వైఎస్సార్‌సీపీ నాయకుడు హెచ్‌ ఫయాజ్‌ భాష, వక్ఫ్‌ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పేద కుటుంబంలో జన్మించి ఎంతో కృషి చేసి ఉన్నత శిఖరాలకు ఎదిగి దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించారన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌ బోర్డు ప్రెసిడెంట్‌ హెచ్‌. షషావలి, వైస్‌ ప్రెసిడెంట్‌ వై. మహబూబ్‌ బాష, అన్వార్‌ బాష, రియాజ్‌, బాబయ్య, రఫీ, షబ్బీర్‌, నూర్‌, జబ్బార్‌, సుహైల్‌, హయత్‌ బాష ఖాద్రి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img