Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఘనంగా వసంత మహోత్సవం, డోలి కోస్తవం

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో మూడవ రోజు బుధవారం అర్చకులు శ్రీవత్స వారి శిష్య బృందం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాభిషేకం, షోడా శోపచార పూజ భక్తా నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమంది కుల బాంధవుల నడుమ వసంత మహోత్సవ కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చారు. ఉభయ దాతలుగా పొలం కృష్ణమూర్తి అండ్ సన్, శ్యామల సేపూరి కృష్ణయ్య అండ్ సన్స్ ,నాగరత్నమ్మ జింక కంబగిరి అండ్ సన్స్, సరస్వతి జింక శ్రీనివాసులు అండ్ సన్స్, చెన్నమ్మ వర్ది చెన్నకేశవులు అండ్ సన్, ధోని కోస్తావా ఉభయ దాతలుగా 14 మంది దాతలుగా వ్యవహరించడం పట్ల కమిటీ వారు వారి పేరిటన ప్రత్యేక పూజలు చేయించి, ఘనంగా సత్కరించారు. తదుపరి సాయంత్రం భద్రావతి భావన రూ సేంద్రుల వారికి డోలి కోసవం అనగా శయైనోత్సవమును సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య ,ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కోశాధికారి పోరాల్ల పుల్లయ్య, సహాయ కార్యదర్శి బొడగల శంకర, సమన్వయ కమిటీ సభ్యులు అండ్ గౌరవ అధ్యక్షులు కుంటూ మల్ల నారాయణ, ఆర్వేటి లక్ష్మీకాంతం ,నాగమల్లి, వెంకటస్వామి తోపాటు కమిటీ పాలకవర్గం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img