Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర ` ఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 50 వ జన్మదిన వేడుకలు బుధవారం ఉరవకొండలో ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్సిపి పార్టీ శ్రేణులు ఈ వేడుకల్లో పాల్గొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్‌లను కట్‌ చేశారు. పరస్పరం అభినందనలు తెలుపు కొన్నారు. ఈ సందర్భంగా ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలలో పలువురు నేతలు, కార్యకర్తలు,ప్రజలు రక్తదానం చేశారు. అనాథ పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. తొలుత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు. వేరేవేరుగా జన్మదిన వేడుకలను నాయకులు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు వైయస్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి ఆయన తనయుడు ప్రణయ్‌ రెడ్డి పాల్గొన్నారు. రోడ్లు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదనారెడ్డి పాల్గొన్నారు. వైయస్‌ విగ్రహం వద్ద ద్వివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అభిమాన సంఘం నాయకులు ధర్మపురి హనుమంతు రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img