విశాలాంధ్ర`ఉరవకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఉరవకొండ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు శివన్న జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సిపిఐ పార్టీ పేద, బడుగు, బలహీన,కార్మిక కర్షక, వర్గాల కోసం అలుపెరుగని ఎన్నో పోరాటాలను నిర్వహించి ఎన్నో విజయాలను కూడా సాధించిందని కొనియాడారు ప్రస్తుతం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాలు రాస్తున్న ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయని వీటికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా సిపిఐ పార్టీ పట్ల ఆకర్షితులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్,ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూర్ కార్యదర్శి సుల్తాన్, విడపనకల్లు కార్యదర్శి రమేష్, పార్టీ సానుభూతిపరుడు డాక్టర్ ఎర్రి స్వామి,మల్లేష్, చక్రధర్ మహిళా సంఘం నాయకులు, వన్నూరమ్మ, నూర్జహాన్,తదితరులు పాల్గొన్నారు