Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం పట్ల టిడిపి నిరసన

విశాలాంధ్ర- ఉరవకొండ : కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం పట్ల ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ వన్ మరియు బ్రిటిష్ కాలంలో ఉన్న నల్ల చట్టాలను 1861 పోలీస్ యాక్ట్ ను తీసుకొచ్చి ర్యాలీలు బహిరంగ సభలను నిషేధించడం దుర్మార్గమైన చర్యాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని ఆరోపించారు.ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని అన్నారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం, ప్యారం కేశవానంద, మాజీ సర్పంచులు గోవిందు, వెంకటేశులు ఓబులేసు మైనార్టీ నాయకులు కలందర్, రహంతుల్లా వీరితో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img