Friday, April 19, 2024
Friday, April 19, 2024

చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకున్న జడ్పీ చైర్మన్

విశాలాంధ్ర- ఉరవకొండ : గవి మఠ రథోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గవిసిద్దేశ్వర ఆలయంలో వెలిసిన చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.గవిమఠం విశిష్టత, చరిత్ర గురించి అర్చకులను అడిగి చైర్మన్ తెలుసుకున్నారు.అంతకముందు గవిమఠం అధికారులు,అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గవిమఠం 8 వ పీఠాధిపతులు శ్రీ జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి వారిని కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ జడ్పిటిసి సభ్యులు ఏసి పార్వతమ్మ, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రి స్వామి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img