విశాలాంధ్ర`ధర్మవరం : పట్టణములోని సత్యసాయి నగర్ కు చెందిన జనసేన పార్టీ కార్యకర్త చేనేత కార్మికుడు పోతిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఇటీవల మగ్గం పనిచేస్తుండగా అకస్మాత్తుగా కాలుజారి పడ్డాడు. దీంతో కాలు ఫ్రాక్చర్ అవడంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి గురువారం వెళ్లి పరామర్శించి వైద్యం ఖర్చులు కింద 5000 రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. మున్ముందు కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, సీనియర్ నాయకులు లింగాల ప్రకాష్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, రూరల్ మండల కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహన కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్, దాడి తోట కృష్ణయ్య, కాశీం, సంజీవ తదితరులు పాల్గొన్నారు.