Friday, April 19, 2024
Friday, April 19, 2024

చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్…

106 గ్రాముల బంగారం మూడు సెల్ ఫోన్లు స్వాధీనం…

విశాలాంధ్ర-గుంతకల్లు : బేల్దారు పని చేసుకుంటూ రైళ్లల్లో చైన్ స్నాచింగ్ దొంగతనానికి అలవాటు పడిన దొంగను జి ఆర్ పి ,ఆర్పిఎఫ్ సంయుక్త బృందం పోలీసులు చేదించి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారం సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రైల్వే జి ఆర్ పి ఎస్ పి కె.చౌడేశ్వరి ఆదేశల మెరకు రైల్వే జి ఆర్ పి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే డి.ఎస్.పి ఎస్ కె.అబ్దుల్ ఆజీజ్ మాట్లాడుతూ సి కె పల్లి మండలం వెంకటం పల్లి గ్రామానికి చెందిన సాకే ఉదయ్ అనే నేరస్థుడు చైన్ స్నాచింగ్ దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి 6 గోల్డ్ చైన్లు మొత్తం 106 గ్రాముల విలువగల బంగారం అదేవిధంగా మూడు సెల్ ఫోన్లు మొత్తం 5 లక్షల 19 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిరస్తుడిపై 8 కేసులు అంగీకరించడంతో కోట్ల హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జి ఆర్ పి సీఐ నాగేష్ బాబు,ఆర్ పి ఎస్ ఐ కె.గోపాల్ ,జి ఆర్ పి ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img