జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అన్నా దొరై
విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అన్న దొరై అన్నారు. బుధవారం స్థానిక మహాత్మా జూనియర్ కళాశాల ఆవరణలో విద్య దీవెన చెక్కును పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయి చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గం లో 5466 విద్యార్థులుకు 4875 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.28991595 కోట్లు రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు పార్వతమ్మ, ఎంపీపీ చంద్రమ్మ, సోషల్ వెల్ఫేర్ అధికారులు, కళాశాల సిబ్బంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.