Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి..

ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ
విశాలాంధ్ర- ధర్మవరం : వార్తల సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టులపై ప్రత్యక్షంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు మోహన్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం కు వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తుందన్న న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై దాడి చేసి, వాహనాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. అదేవిధంగా హెచ్ఎంటీవీ, టీవీ ఫైవ్, ప్రతినిధులపై కూడా దాడి చేయడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావతం కాకుండా తగల చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మురళి గౌడ్, సభ్యులు నాగభూషణం, రమేష్ నాయుడు, టీవీ ఫైవ్ రాఘవ, సుబ్బు, కళ్యాణ్, రాజా, రమణ, గోవర్ధన్ రెడ్డి, దొడ్డప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img