Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయస్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల బాలికలు విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : జాతీయస్థాయి జూడో పోటీలకు మండల పరిధిలోని చికిచెర్ల జడ్పీ హైస్కూల్ బాలికల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల పిడి ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఈనెల 18వ, 19వ తేదీలలో కళ్యాణదుర్గంలో జ్ఞాన భారతి జూనియర్ కాలేజీలో అండర్ -19 స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి జూడో పోటీలు జరిగాయి. ఈ పోటీలో 52 కేజీల విభాగంలో కే. మహిత బంగారు పతకం, 48 కేజీల విభాగంలో వై. శ్రీ నిత్య రజతం, 36 కేజీల విభాగంలో సి .నిఖిత బంగారు పథకమును సాధించడం జరిగిందన్నారు. ఈ విద్యార్థులు జూన్ 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్ లో జరిగే జాతీయ జూడో స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ విద్యార్థులందరినీ హెచ్ఎం తో పాటు పిడి ప్రతాపరెడ్డి సీనియర్ క్రీడాకారులు ప్రతాప్, నాగార్జునలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img