Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి.. జడ్జీలు.. శివ పార్వతి, రమ్య సాయి

విశాలాంధ్ర-ధర్మవరం : ఫిబ్రవరి 11న నిర్వహించబడే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శివపార్వతి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల కోర్టులో డివిజన్ పరిధిలోని పోలీసులతో కోర్టు న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ న్యాయవాదులు, పోలీసులు ,కచ్చిదారులు సమన్వయంతో సహాయ సహకారాలు అందించినప్పుడే ఈ జాతీయ మెగా లోక్ అదాలత్తులు విజయవంతం అవుతాయని తెలిపారు. రాజీకు తగ్గ అన్ని కేసులు కూడా ఈ లోక్ అదాలతో పరిష్కరించబడునని తెలిపారు. అనంతరం న్యాయవాదులు, డివిజన్లోని పోలీస్ స్టేషన్ ల ద్వారా ఈ లోక్ అదా లత్తుకు వచ్చే కేసుల పైన కూడా వారు చర్చించారు. ఈ లోక్ అదాలతో కచ్చిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ తోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img