విశాలాంధ్ర- ధర్మవరం : ఈనెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు కర్ణాటకలోని ధార్వాడ నందు జరగబోవు జాతీయ యువజన ఉత్సవాలకు గాను పట్టణములోని వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థిని కావ్యాకు ఆహ్వానం అందిందని ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ కావ్య మా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ రెండవ సంవత్సరం చదువుతోందని, కావ్య గత నెలలో విజయవాడ నందు జరిగిన రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలలో భాగంగా వక్తృత్వ పోటీల నందు రెండవ స్థానంలో ఎంపిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందని,తిరిగి జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనుటకు మా కళాశాల విద్యార్థికి ఆహ్వానం రావడం అత్యంత ఆనందదాయకంగా ఉందని తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతో తాను మాట్లాడే అవకాశం పొందడం చాలా గొప్ప విషయమని, అందుకే కావ్య కు అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలను సాధించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో కరీముల్లా, అధ్యాపకులు, బోధన్యతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.