Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జాతీయ సదస్సులో ఎస్వీఐటీకి బహుమతులు

విశాలాంధ్ర-రాప్తాడు : బళ్ళారిలోని రావు బహదూర్‌ వై మహబలేశ్వరప్ప ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన జాతియె సాంక్ఱెతిక సదస్సులో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల ఈసీఈ విద్యార్థులు మౌనిష్‌, ఫర్హానా బాను, అభిషేక్‌, హేమంత్‌ కుమార్‌, తరుణ్‌ లు ఉత్తమ ప్రతిభ కనబరచి వివిధ విభాగాలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారని ఈసీఈ విభాగాధిపతి ఎన్‌ఏవీ ప్రసాద్‌ తెలిపారు. ఈసందర్భంగా ఎస్వీఐటీ కళాశాల కరస్పాండెంట్‌ వీ.బీ.ఆర్‌.శర్మ, ,చైర్మన్‌ బీ.వీ.క్రిష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెన్నెపూస రవీంద్రరెడ్డి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సీ.ఈ.ఓ ఆనంద్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సూర్యశేఖరరెడ్డి ,కో ఆర్డినేటర్‌ రంజిత ,మురళీమోహన్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img