Friday, April 19, 2024
Friday, April 19, 2024

జాతీయ సదస్సు నగదు బహుమతికి ఆంద్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎంపిక

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం లోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విద్యార్థిని పాముల శైలజ, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ జాతీయ సెమినార్లో నగదు బహుమతికి ఎంపికైంది. తాడేపల్లిగూడెం లోని డి.ఆర్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రకాశిక సాహిత్య పత్రిక వారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా డిగ్రీ మరియు పీజీ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థుల కు జాతీయ సెమినార్ నిర్వహిస్తూ, వారికి నగదు బహుమతులు ప్రకటించింది. ఆ పోటీలో అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విద్యార్థులు పాల్గొన్నారు. సెమినార్ పత్రాలను సమర్పించారు.. ఆ పోటీల్లో ఎం. ఏ. తెలుగు మొదటి సెమిస్టర్ విద్యార్థిని పాముల శైలజ విజేతగా నిలిచిందని, శుక్రవారం తాడేపల్లిగూడెం లోని డి.ఆర్.జి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్ నిర్వాహకులు డా. సుంకర గోపాలయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ఏ. కోరి శైలజ ను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img