Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జాతీయ స్థాయి శిబిరానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక

ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి
విశాలాంధ్ర`ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణములోని స్థానిక కే. హెచ్‌.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ ప్రధమ సంవత్సరం చదువుతున్న ఎం.ఎస్‌ చరణ్‌ సాయి అనే విద్యార్థి యాన్యువల్‌ హాగ్‌ షిప్‌ ప్రోగ్రాం ఆఫ్‌ రెడ్‌ రోప్‌ అనే సదస్సుకు శ్రీ సత్యసాయి జిల్లా నుండి ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. అనంతరం వారు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చతిస్గడ్‌ లో ఈనెల 23 నుండి డిసెంబర్‌ 10 వరకు అనగా 14 రోజులు పాటు ఈ సదస్సు నిర్వహించబడుతుందని, 14 అంశాలపై 14 జిల్లాలలో సైకిల్‌ పై పర్యటించనున్నాడని వారు తెలిపారు. అదేవిధంగా అక్కడ ఆయా ప్రాంతాలలో ఉన్న వలసలు, అక్రమ రవాణా, విద్య ,ఆర్థిక అభివృద్ధి, మానవ హక్కులు వంటి అనేక అంశాలను పరిశీలించనున్నారని తెలిపారు. తదుపరి విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలలో చేరిన తక్కువ కాలంలోనే తమ అబ్బాయి అభివృద్ధికి తోడ్పడడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తదుపరి ప్రిన్సిపాల్‌ తో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవన్‌ కుమార్‌, అధ్యాపకులు రాబియా బేగం,చిట్టెమ్మ ,సమీవుల్లా, గోపాల్‌ నాయక్‌, కిరణ్‌ కుమార్‌, శివప్రసాద్‌, పావని, కేవై స్వామి, పుష్పావతి, గౌతమి, అధ్యాపేకేతర బృందం తోపాటు విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img