విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల జడ్పీహెచ్ఎస్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఎస్జీఎఫ్ అండర్- 14, అండర్ -17 బాల బాలికల ఎంపికల పోటీలకు రాప్తాడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొని జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అండర్- 14 బాలికల జట్టులో వై.భవిత, బాలుర జట్టులో టి. నరసింహ, అండర్-17లో బాలికల జట్టుకు జే.కీర్తన,బాలురు జట్టులో జె. రాజేష్ ఎంపికయ్యారని హెచ్ఎం బి.నరసింహులు, పీడీ ఎన్. కేశవమూర్తి తెలిపారు. వీరు అనంతపురము జిల్లా తరపున రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రీడలలో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ఎంపికపై ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.