Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జిల్లా మానవ హక్కుల నేతలు అధికారులను మర్యాదపూర్వకంగా కలయిక

విశాలాంధ్ర. పెనుకొండ : పెనుకొండలో సోమవారం నూతనంగా ఎంపికైన మానవ హక్కుల అధ్యక్షులు మరియు సభ్యులు అధికారులతో మర్యాదపూర్వకంగా కలిసి సామాజిక న్యాయం కోసం సహకరించాలని మనవి. సామాజిక న్యాయం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని సహకరించాలని అంతర్జాతీయ షా సోషియల్ జస్టిస్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సత్య సాయి జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షులు. సమీవుల్లా, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి, రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ ఆధ్వర్యం లో నగర పంచాయతీ కమీషనర్ వంశీకృష్ణ, తహశీల్దార్ స్వర్ణలత మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు. పెనుకొండ ప్రాంతంలో సామాజిక న్యాయం కోసం తాము కృషి చేస్తున్నామని, అధికారులు సహకరించాలని హ్యూమన్ రైట్స్ కమిటీ అధికారులను కోరింది. జీవించే హక్కు కాకుండా అనేక హక్కులు మానవ హక్కుల పరిధిలోకి వస్తాయి. సమానత్వపు హక్కు, సమాన అవకాశాల హక్కు ప్రజలందరికీ ఈ హక్కులు ఉపయోగపడే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేద్దామని వారు కోరారు ఈ కార్యక్రమంలో రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img