Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

జూటూరు బ్రదర్స్‌, సిస్టర్స్‌ సేవాసమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్వెట్టర్స్‌ పంపిణీ

విశాలాంధ్ర- జేఎన్టీయూ : అనంతపురం పట్టణంలోని పుల్లరేవు ఆదినారాయణ రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ లో ఆశ్రయం పొందుతున్న పేద విద్యార్థులకు సోమవారం జూటూరు బ్రదర్స్‌, సిస్టర్స్‌ సేవాసమితి ఆధ్వర్యంలో సెట్టర్స్‌ను సమితి బ్రదర్స్‌ జూటూరు మహేష్‌ బాబు, శైల కుమారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరాశ్రయులకు చేయూతను ఇచ్చినందుకు తమకు ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటూరు అరవిందు, జ్యోతి, మధు, గోపాలకృష్ణ, కాకర్లపర్తి కిషోర్‌, వైసవి, ఆర్‌ రత్నం, పావని, ధన్వని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img