Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జెఎన్టియుఏ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..

విశాలాంధ్ర- జె ఎన్ టి యుఏ: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల (అనంతపురం) ఈసీఈ రెండో సంవత్సరం విద్యార్థి చాణక్య (19) గురువారం తెల్లవారుజామున హాస్టల్ పై కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి చెందిన చాణుక్య రాత్రి స్నేహితులందరితో మాట్లాడి సంతోషంగా ఉండేవాడని చెబుతున్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు తన స్నేహితులకు ాబై్ణ అని సందేశం పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదటి సంవత్సరంలో 9.8 జి.పి.ఎ మార్కులు సొదించాడు. ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img