కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల ఆంజనేయులు
విశాలాంధ్ర – ఉరవకొండ : కేంద్రంలో బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈనెల 24న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగే జై భారత్ సత్యాగ్రహ సభను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్ల ఆంజనేయులు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఆర్ చెన్నప్ప పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల అత్యధిక గృహం ఆవరణలో సత్యాగ్రహసభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో అధికార బిజెపి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిత్యవసర వస్తువులు, పెట్రోలు గ్యాస్ తదితర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుడి బతుకు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. మోడీని గద్దె దించే వరకూ ప్రజలను చైతన్య పరుస్తూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. జై భారత్ సత్యాగ్రహ సభ లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఓబులేసు, మైనార్టీ నాయకులు అబ్బాస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు