Friday, April 19, 2024
Friday, April 19, 2024

జోరుగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం

విశాలాంధ్ర – ఉరవకొండ : జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం శనివారం ఉరవకొండ పట్టణంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి సర్పంచ్ లలిత, ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి,జేసిఎస్ పట్టణ కన్వీనర్ ఆసిఫ్ తదితరులు ఃజగనన్నే మా భవిష్యత్ః కార్యక్రమం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి నాలుగేళ్ళలో సీఎం జగన్ చేసిన మేలును వివరించారు.జగన్మోహన్ రెడ్డి పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఆయా ఇళ్ల యజమానుల అనుమతి తో ఃమా నమ్మకం నువ్వే జగన్ః అనే స్టిక్కర్లను ఇంటికి మొబైల్ ఫోన్ కు అతికించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం ప్రజలు జగన్ వైపే ఉన్నారని ఃజగనన్నే మా భవిష్యత్ః కార్యక్రమం ద్వారా తమకు అర్థమైందన్నారు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వెంకటేసులు, నాయకులు రామాంజనేయులు, గంగాధర్,బండి గోపి, గృహసారథులు ఆనంద్, రమేష్,వలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img