Friday, April 19, 2024
Friday, April 19, 2024

టీడీపీ కార్యకర్త మృతికి సంతాపం

విశాలాంధ్ర`కళ్యాణదుర్గం : కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత కరణం తిమ్మప్ప (82) మృతి చెందారు. ఈయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే టీడీపీి రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరాయ చౌదరి సంతాపం ప్రకటించారు. గురువారం ఒంటారెడ్డిపల్లి వెళ్లి కరణం తిమ్మప్ప భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తిమ్మప్ప మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో కంబదూరు మాజీ సర్పంచ్‌ శ్రీరాములు పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కరణం రామ్మోహన్‌ చౌదరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్‌ శివన్న తదితరులు తిమ్మప్ప మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img