Friday, April 19, 2024
Friday, April 19, 2024

టేబుల్ టెన్నిస్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర /ఉరవకొండ : అనంతపురంలో జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ గేమ్ మీట్ నందు ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి టేబుల్ టెన్నిస్ లో విజేతలుగా నిలిచారు. వీరిని సోమవారం కళాశాల ప్రిన్సిపల్ ఆశ్రఫ్ ఆలీ మరియు పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక బృందం అభినందించింది. ఫిబ్రవరిలో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ గేమ్ మీటికీ క్రీడాకారులు ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఈ విభాగం అధిపతి వై. సురేష్ బాబు ఫిజికల్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img