Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన ఉన్నత విద్యాశాఖ ఆర్జేడి

విశాలాంధ్ర -పెనుకొండ : పేనుకొండ నందు పరిటాల శ్రీరాములుప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం ఉన్నత విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ నాగలింగారెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు, అధ్యాపకుల అటెండెన్స్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఏర్పాటు చేసి రివ్యూ మీటింగ్ లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు, ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఉన్నత విద్యలో రాబోయే సంస్కరణలు, మార్పులు ,సింగిల్ సబ్జెక్టు విధానం పై మాట్లాడారు .కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కళాశాల అభ్యున్నతకు చేస్తున్న వ్యూహాలు ,త్వరలో జరిగే న్యాక్ లో కళాశాలకు మంచి గ్రేడింగ్ కోసం తయారుచేసిన యాక్షన్ ప్లాన్ గురించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీలం రమేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 80 లక్షలతో విద్యార్థుల కోసం కియా కంపెనీ కళాశాలలో నిర్మించిన లైబ్రరీ బ్లాక్ కోసం విశేష కృషి చేసిన ప్రిన్సిపాల్ ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక ,అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img