విశాలాంధ్ర- పెనుకొండ :పెనుకొండ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జీ బి కే పార్థసారథి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, దళిత సంఘ నాయకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.