Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తేదేపా నాయకులపై ఎమ్మెల్యే ధ్వజం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు ఎమ్మెల్యే కార్యాలయం నందు శనివారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ ఇటీవల మండల పరిధిలోని కొండంపల్లి లో తేదేపా కార్యకర్త ఇంటి పై వైసిపి శ్రేణులు దాడులు చేశారని,శ్రీరాములు నాయక్ ని కొట్టారని లేనిపోని అసత్యాలను పచ్చ మీడియాలో పబ్లిసిటి చేస్తున్నారు సవిత,పార్థసారథి లకు నిజాలు కనపడవా మీ లోకేష్ బాబు చెప్పినట్టు మీరు అపద్దాలు చేబుతారా స్థానిక ఎమ్మెల్యేలను తిట్టడమే మీ పనా మేం చేసి చేస్తున్న అభివృధ్ధి మీ కళ్ళకు కనపడదా
జగనన్నే మా భవిషత్తు కార్యక్రమం ఎంతో ఘనంగ జరుగుతోంది,ప్రతి ఇంటికి వెళ్ళిన వైసిపి శ్రేణులకు మహిళలు బ్రహ్మరథం పడూతున్నారు,జగనన్నసంక్షేమ పథకాల గురించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరీ ఇవేవీ తేదేపా నాయకులకు వారి పిచ్చి పచ్చ మీడియాకు కనపడవా అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీరామ్ నాయక్ లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి మా కార్యకర్తల మీదే దురుసుగా ప్రవర్తించి లేని ఘర్షణకు దారి తీసే విధంగా ప్రవర్తించాడని మా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం గిరిజనుల యొక్క హక్కులను కాపాడడం వారికి అండగా ఉండడం మా యొక్క సిద్ధాంతమని గిరిజనులకు ఘర్షణలు పెట్టడం మా సిద్ధాంతం కాదని తెలుగుదేశం పార్టీ నైజాం బయటపడిందని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img