విశాలాంధ్ర- ఉరవకొండ : అనంతపురం జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను నివారించాలని అలాగే దాడులు చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను తక్షణమే నమోదు చేయాలని అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడుని బుధవారం అనంతపురంలో కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దళితులపై జరిగిన దాడులకు సంబంధించి అనేక విషయాలను తనతో పాటు రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పిగిరి లక్ష్మీనారాయణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామిదాస్ మరియు రాయలసీ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి అక్కలప్ప అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఉరవకొండ తాలూకా అధ్యక్షుడు రాంపురం చెన్నప్ప ఉరవకొండ తాలూకా గౌరవ అధ్యక్షుడు ఎం గంగాధర్ ఉరవకొండ తాలూకా ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల సురేష్ తదితరులు అందరూ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.