Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దాతల దాతృత్వం మరువలేనిది.. శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి దాతల యొక్క దాతృత్వం మరువలేనిదని శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నాడు 380 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను వారు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కూడా పంచి పెట్టారు. ఈరోజు భోజన దాతలుగా కీర్తిశేషులు బత్తిని నారాయణస్వామి, మణికంఠల సహాయ సహకారాలతో ఈ భోజన పంపిణీ జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత శ్రీ సత్య సాయి సేవ సమితి కమిటీకి, దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 17 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img