విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని ఎస్.కె ప్రభుత్వ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నాగమణి దివ్యాంగురాలు ఈ విషయాన్ని పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్న ఎన్ ఎర్రిస్వామి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు రాఘవ కాటూరి అన్నపూర్ణ దంపతులను మెయిల్ ద్వారా సంప్రదించి దివ్యాంగురాలు అయిన విద్యార్థినికి సహాయం అందించాలని విన్నవించారు. స్పందించిన దంపతులు విద్యార్థినికి ట్రై సైకిల్ అందజేయాలని సూచిస్తూ అవసరమైన మొత్తాన్ని స్పెషల్ ఎడ్యుకేటర్ ఎర్రిస్వామికి పంపారు. ఆ మొత్తంతో మూడు చక్రాలు సైకిల్ కొనుగోలు చేసి బాబా జన్మదినోత్సవమైన బుధవారం రోజు పాఠశాల హెచ్ఎం ప్రభాతమ్మ చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.