Friday, April 19, 2024
Friday, April 19, 2024

దివ్యాంగులు మరింత అభివృద్ధి బాటలో నడవాలి.. ఏఎస్‌ఐ రఘురాముడు

విశాలాంధ్ర`ధర్మవరం : దివ్యాంగులు మరింత అభివృద్ధి బాటలో నడవాలని, నేడు అన్ని రంగాలలో ముందంజలో ఉండడం ఎంతో సంతోషించు తగ్గ విషయమని ఏఎస్‌ఐ రఘురాముడు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఎల్సికేపురంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంకు ఎస్‌ఐ రఘురాముడు, మున్సిపల్‌ పాఠశాల హెచ్‌ఎం నాగప్ప పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంఈఓ సుధాకర్‌ నాయక్‌ నేతృత్వంలో జరిగాయి. అనంతరం రఘురాముడు మాట్లాడుతూ దివ్యాంగులను ప్రేమతో పలకరించాలని, తల్లిదండ్రులు కూడా మంచిగా ప్రేమతో చూసుకుంటూ ఉండాలని తెలిపారు. నేడు దివ్యాంగులు అన్ని రంగాలలో ముందంజలో ఉంటూ మంచి ప్రతిభను ఘనపరచడం నిజంగా సంతోష్దాయకం అన్నారు. అనంతరం దివ్యాంగులకు వివిధ పోటీలను నిర్వహించగా అందులో ప్రతిభ కలిగిన దివ్యాంగులకు ఎస్‌ఐ. రఘు రాముడు చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం స్వీట్‌ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ భాస్కర్‌ నాయక్‌, భవిత స్కూల్‌ టీచర్లు రమాదేవి, సరస్వతి, స్కూల్‌ అసిస్టెంట్‌ శ్రీలత, రామకృష్ణ రమణ తదితరులు, దివ్యాంగుల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img