Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దుర్గమ్మ గుడికి వెండి త్రిశూలం బహుకరణ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని దుర్గమ్మ తల్లి దేవాలయమునకు పట్టణానికి చెందిన దాసరి వెంకటేశులు ( చిట్టి) కుమారుడు కార్తీక్ నేత దంపతులు సోమవారం రోజున ఒక కేజీ నూరు గ్రాములు బరువు గల వెండితో తయారుచేసిన త్రిశూలమును(విలువ రూ.86,000) ఆలయ చైర్మన్ సిరిపి పర్వతయ్యకు అందజేశారు. అనంతరం గుడిలో వారి పేరిటన ప్రత్యేక పూజలను చేసి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశులు ఆలయ సిబ్బంది మల్లికార్జున, హరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img