Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేవాలయంలో అన్నదానం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేట రాములవారి దేవాలయంలో శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ అయిన సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలవికాస వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తన వంతుగా 300 మందికి భోజన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని సేవా ఫౌండేషన్ ఇన్చార్జ్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పట్టణ గ్రామీణ ప్రాంతాలలో మరింతగా అభివృద్ధి పరచడానికే సమరసత సేవా ఫౌండేషన్ ఏర్పాటు కావడం జరిగిందన్నారు. భక్తి భావం పెంపొందించే విధంగా ఈ ఫౌండేషన్ పని చేస్తుందని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img